Ghani: బాలీవుడ్ మొదలుకుని దక్షిణాది సినిమాల వరకు మల్టీ స్టార్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతలు చాలావరకు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మాత్రమే కాదు బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. గతంలో మాదిరిగా వందరోజులు అంతకంటే ఎక్కువ ఆడే పరిస్థితి లేని నేపథ్యంలో.. ఒక్క సినిమాలోనే ఇద్దరు భారీ హీరోలను పెట్టి భారీ లాభాలు పొందటానికి ప్రొడ్యూసర్లు సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు.
ఈ తరహాలోనే తెలుగులో బాహుబలి, “ఆర్ఆర్ఆర్” సినిమాలు తెరకెక్కి భారీ లాభాలు నిర్మాతలకు తెచ్చిపెట్టాయి. ప్రజెంట్ “ఆర్ఆర్ఆర్” అయితే ఇంకా రన్నింగ్ లో ఉంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ నటించిన గని మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పోయిన వారమే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నం లో జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రావటం సినిమా బాగుందని చెప్పడం తెలిసిందే.
అయితే ఇంకా కొద్ది రోజులు మాత్రమే సినిమా విడుదల అవటానికి సిద్ధంగా ఉండటంతో…. వరుణ్ తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లలో ఎవరితో మల్టీస్టారర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వరుణ్ తేజ్ నీ ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. దానికి వరుణ్ సమాధానమిస్తూ… నితిన్, సాయిధరమ్ తేజ్ తో అయితే.. మల్టీ స్టారర్ సినిమా చేస్తాను అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇద్దరు హీరోలతో నాకు మంచి కంఫర్ట్ ఉంది. సబ్జెక్ట్ కుదిరితే గ్యారెంటీగా చేస్తాను అని వరుణ్ తేజ్ ఆన్సర్ ఇచ్చాడు.