Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి”. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగకి విడుదల కానుంది. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు ఈ సినిమా తీయడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. సినిమా టైటిల్ లోగో రిలీజ్ సమయంలో బాలయ్య కెరియర్ లో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ “సమరసింహారెడ్డి”కి 200 రెట్లు…”వీరసింహారెడ్డి” ఉంటుందని గోపీచంద్ మల్లినేనీ చెప్పటంతో ఉన్న అంచనాలు డబల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే నవంబర్ 25వ తారీకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. “జై బాలయ్య” మాస్ అంథమ్ పేరిట విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ నీ షేక్ చేసేస్తోంది. విడుదలైన 11 గంటల్లోనే 4.3 మిలియన్ ల వ్యూస్ సాధించడం జరిగింది. 1.76 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మాస్ బాణీలు నందమూరి అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి. “అఖండ” సినిమా తరహా ఫ్లేవర్ కంటెంట్ మాస్ బిట్స్… “వీరసింహారెడ్డి”కి ఇచ్చాడని తమన్ మ్యూజిక్ పై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో డైరెక్టర్ గోపీచంద్ మల్లి “తిప్పు సామీ కోర మీసం ” వీరసింహారెడ్డి ఆన్ ఫైర్ అంటూ… సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ లుక్ కనిపిస్తోంది. సాంగ్ లో వైట్ అండ్ వైట్ లుక్ లో బాలయ్య అదరగొడుతున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని లక్కీ హీరోయిన్ శృతిహాసన్.. ఈ సినిమా లో బాలయ్య సరసన ఫస్ట్ టైం నటించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.