Veera Simha Reddy: గత మూడు సంవత్సరాలు సంక్రాంతి పండుగ సమయంలో కోవిడ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. కానీ ఈసారి మాత్రం చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య”, బాలకృష్ణ “వీరసింహారెడ్డి” రెండు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జనవరి 12వ తారీకు “వీరసింహారెడ్డి” విడుదలవుతుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రేపే ఒంగోలులో “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ క్రమంలో అదే సమయంలో రాత్రి 8:17 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇప్పటికే “వీరసింహారెడ్డి” థియేట్రికల్ ట్రైలర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రచ్చ రచ్చ మొదలవుతోంది యూట్యూబ్ లో అని కొన్ని రోజుల క్రితం కామెంట్ చేయడం జరిగింది. ఇక పోస్టర్ లలో… బాలయ్య స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా గోపీచంద్ మలినేని ఈ సినిమా తీయడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా “సమరసింహారెడ్డి” సినిమాకి 200 రెట్లు “వీరాసింహారెడ్డి” ఉంటుందని.. అంచనాలు ఎలాగైనా పెట్టుకోండి దానికి మించి సినిమా ఉంటుందని చెప్పడంతో… అభిమానులు మరింతగా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
వరస పరాజయాలలో ఉన్న బాలయ్య… 2021లో “అఖండ” తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. హిట్ ట్రాక్ ఎక్కారు. మరి “వీరసింహారెడ్డి” తో ఏమేర విజయం అందుకుంటాడో చూడాలి. ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డబల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని లక్కీ హీరోయిన్ శృతిహాసన్.. బాలయ్య సరసన నటించడం జరిగింది. తమన్ అందించిన పాటలు ఇప్పటికీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “వీరసింహారెడ్డి” సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో బావ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టింది. రేపు ట్రైలర్ రిలీజ్ అయ్యాక నాలుగో సాంగ్ సినిమా యూనిట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.