ప్రముఖ నిర్మాత, పారిశ్రామిక వేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ బ్యానర్ విజయా సంస్థ అధినేత నాగిరెడ్డి తనయుడు వెంకట్రామిరెడ్డి .. తండ్రి బాటలోనే పలు చిత్రాలను నిర్మించారు. విజయ్, అజిత్, విశాల్, ధనుష్లతో పాటు తెలుగులో భైరవద్వీపం, శ్రీకృష్ణారున విజయం, బృందావం పేరిట సినిమాలను నిర్మించారు. తండ్రి నాగిరెడ్డి పేరుపై అవార్డును ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఒకరికి అవార్డును అందిస్తూ వస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు సోమవారం చెన్నైలో జరుగుతాయి.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!