తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి, శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మి శరత్కుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం `విక్రమ్ వేద`. తమిళంలో ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకు తెలుగులో రీమేక్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఎందుకనో ఆగిపోయాయి. అయితే ఇప్పుడు నిర్మాత డి.సురేష్బాబు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారట. విజయ్సేతుపతి పాత్రలో వెంకటేష్, మాధవన్ పాత్రలో నారా రోహిత్ కలిసి నటించబోతున్నారని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఓ పోలీస్, గ్యాంగ్ స్టర్ మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.