Nidhi Aggarwal: రెండు తెలుగు రాష్ట్రాలలో జాతకాలు చెబుతూ ఎంతో పాపులారిటీ సంపాదించిన వారిలో వేణుగోపాలస్వామి ఒకరు. రాజకీయరంగంలో ఇంక సినిమా రంగంలో ఈయన అంటే చాలామందికి గౌరవం ఎక్కువ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ రష్మిక మందన అతి తక్కువ టైంలో మంచి పాపులారిటీ సాధించడం వెనకాల వేణుగోపాలస్వామి పూజ బలం ఎక్కువ అని కూడా చాలామంది చెబుతారు. ఇంకా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాజకీయపరంగా ఎవరు గెలుస్తారు ఇంకా క్రీడారంగంలో ఎవరు ఏ రకంగా రాణిస్తారు ఇలా చాలామంది సెలబ్రిటీల జీవితాలకు సంబంధించి ఈయన చెప్పే విషయాలు చాలా వరకు నిజమవుతాయి.
ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో వేణుగోపాలస్వామి చెప్పిన జాతకమే నిజమయింది. కచ్చితంగా ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని తెలియజేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎవరు వస్తారు అనేది ముందుగానే చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో పరిస్థితులు మారటానికి తన ఫాలోవర్స్ తో ప్రత్యేకమైన పూజలు కూడా చేపిస్తారు. ఈ రకంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో వేణుగోపాల స్వామి తాజాగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆమె ఇంట్లో యాగం కూడా చేయించారు. చిత్ర పరిశ్రమలు మంచి అవకాశాల కోసం నిధి అగర్వాల్ చేత రాజశ్యామల పూజ చేయించినట్లు సమాచారం.
ఇస్మార్ట్ శంకర్, సవ్యసాచి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ తర్వాత.. పెద్దగా సక్సెస్ కాలేదు. మరి ఈ క్రమంలో వేనిధి అగర్వాల్ కి మంచి అవకాశాలు రావాలని వేణుగోపాలస్వామి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆమె ఇంటిలో పూజ చేయించారు. పెద్దగా పాపులారిటీ లేని సమయంలో రష్మిక మందన చేత చేయించిన.. రాజ శ్యామల పూజ..ఇప్పుడు నిధి అగర్వాల్ చేత చేయించడం జరిగింది. రష్మిక మందన ఈ పూజ చేసిన తర్వాత.. ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాలతో అవకాశాలు అందుకుని 2021లో పుష్ప సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించింది. మరి రష్మిక మందన తరహాలో నిధి అగర్వాల్ తలరాత మారుతుందేమో చూడాలి.