కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ కూడా మిక్స్ చేసి సినిమాలను మన దర్శక నిర్మాతలు రూపొందిస్తున్నారు. ఇలాంటి సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. అలా ఆసక్తి చూపించే హీరోల్లో మహేష్ ఒకరు. ఆయన నటించిన 25వ చిత్రం `మహర్షి`. ఈ సినిమా మే 9న విడుదలై మంచి కలెక్షన్స్తో విజయాన్ని దక్కించుకుంది. కలెక్షన్స్తో పాటు పలువురి ప్రశంసలు కూడా దక్కించుకుంటుంది. రీసెంట్గా సినిమాను చూసిన భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మహేష్, వంశీ పైడిపల్లి సహా ఎంటైర్ యూనిట్కు అభినందనలు తెలిపారు.
“కుటుంబ సభ్యులతో కలిసి `మహర్షి` చిత్రాన్ని చూడటం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన అవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగ్గ మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను తెలియజెప్పిన చిత్రమిది. సహజమైన నటనను కనపరిచిన కథానాయకుడు మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు సహా ఎంటైర్ యూనిట్కు అభినందనలు“ అని అన్నారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.
ట్విట్టర్లో వెంకయ్యనాయుడు `మహర్షి` సినిమాను అభినందించగానే హీరో మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. చాలా గర్వంగా ఉందని, ఇలాంటి ప్రశంస తమకు ఇన్స్పిరేషన్గా నిలిచి, మహర్షిలాంటి మంచి సినిమాలు చేయాలనే ఆలోచన, బాధ్యతను మరింత పెంచింది“ అని వారు తెలిపారు.
.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!