పేరుకు దక్షిణాది భామే అయినప్పటికీ విద్యాబాలన్ ఇప్పుడు నార్త్ ఇండియా కోడలు. పుట్టింటి మీద మమకారం పోదు అన్నట్టు.. ఇప్పుడు విద్యా మళ్లీ దక్షిణాది సినిమాలతో బిజీ అవుతోంది. `నీకు నాకు రెండు ఇష్టాలుంటాయా బావా` అని యన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడులో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న విద్యాబాలన్ తాజాగా పింక్ రీమేక్లో నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరగుతోంది. ఈ సినిమాలో విద్యాబాలన్ ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే . బోనీకపూర్ నిర్మిస్తున్నారు. శ్రీదేవి మీద ఉన్న అభిమానంతో ఈసినిమా చేస్తున్నట్టు విద్యాబాలన్ ఇదివరకే చెప్పారు.అజిత్ నటిస్తున్న 59వ సినిమా ఇది. నెర్కొండపార్వై అని పేరు పెట్టారు. ఆగస్ట్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులోనూ అనువాదమయ్యే అవకాశాలున్నాయి. సో ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో దక్షిణాదివారిని పలకరించిన విద్యాబాలన్ ఇప్పుడు మళ్లీ మూడో సారి సిద్ధమవుతున్నారన్నమాట.
previous post
next post