ప్రేక్షకుల అభిరుచి మారుతుంది, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు బయోపిక్స్ రూపొందుతున్నాయి. పలు రంగాల్లో ప్రముఖ వ్యక్తుల బయోపిక్ వెండితెరపై, వెబ్ సిరీస్ల రూపంలో తెరకెక్కుతున్నాయి. సిల్క్ స్మిత బయోపిక్ `డర్టీపిక్చర్`లో తనదైన నటనతో మెప్పించిన విద్యాబాలన్ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`లో బసవ తారకం పాత్రలో నటించారు. ఇప్పుడు మరో బయోపిక్లో నటిస్తున్నారు. హ్యుమన్ కంప్యూటర్గా పేరు పొందిన మహిళా గణిత మేధావి శకుంతలా దేవి బయోపిక్ `శకుంతలాదేవి` షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రానన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.