SIIMA 2022: దక్షిణాది సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలలో “సైమా” ఒకటి. గత రెండు సంవత్సరాలు దేశంలో కరోనా విలయతాండవం చేయడంతో పాటు పరిస్థితులు అనుకూలించకపోవడంతో సైమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు.. సాధారణ స్థితి నెలకొనడంతో..”సైమా 2022″ అవార్డుల కార్యక్రమం బెంగళూరులో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 10 మరియు 11 తారీఖులలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు పలు తెలుగు మరియు కన్నడ చిత్రాలకు భారీ ఎత్తున అవార్డులు వచ్చాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” సినిమాకి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్…కి అవార్డులు లభించాయి. ఇదే సమయంలో హీరో విజయ్ దేవరకొండ కి ఇంకా హీరోయిన్ పూజ హెగ్డే కి కూడా అవార్డులు వచ్చాయి. మేటర్ లోకి వెళ్తే సౌత్ ఇండియా యూత్ ఐకాన్ ఫిమేల్ క్యాటగిరిలో పూజా హెగ్డే కి, సౌత్ ఇండియా యూత్ ఐకాన్ మెల్ క్యాటగిరిలో విజయ్ దేవరకొండ కి సైమా అవార్డులు వచ్చాయి. ఇద్దరూ కూడా బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వరుసపెట్టి అవకాశాలు అందుకుంటూ ఉన్నారు.
ఫిమేల్ యూత్ ఐకాన్ అవార్డు మాత్రమే కాదు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్ గా కూడా పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. దీంతో “సైమా 2022” అవార్డుల ప్రధానోత్సవంలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. కరోనా తర్వాత విజయ్ దేవరకొండకి ఇంకా పూజ హెగ్డేకి చెప్పుకోదగ్గ హిట్ ఒకటి కూడా పడలేదు. అయినా గాని ఈ ఇద్దరికీ అవార్డులు రావడం విశేషం. ఇంకా ఇదే సమయంలో హీరోయిన్ శ్రీలీలా, “ఉప్పెన” డైరెక్టర్ బుచ్చిబాబు సన, కృతి శెట్టికి అవార్డులు లభించాయి.