“లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ఏ సినిమాకి చేయని రీతిలో “లైగర్” కార్యక్రమాలు జరుగుతున్నాయి. “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం రెండు చోట్ల జరగడం జరిగింది. తెలుగు భాషకి సంబంధించి హైదరాబాద్ ఇంకా హిందీ భాషకు సంబంధించి ముంబైలో కార్యక్రమం నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మొన్న ముంబైలో బాంధ్ర వీధిలో అక్కడి వారితో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే సందడి చేయడం జరిగింది. ఆ తర్వాత ముంబైలో లోకల్ ట్రైన్ లో సందడి చేశారు. అంతక ముందు ముంబైలో భారీ షాపింగ్ మాల్ లో కూడా “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించగా భారీ ఎత్తున అభిమానులు రావడంతో విజయ్ దేవరకొండ మధ్యలోనే కార్యక్రమం ఆపేసి వెళ్లిపోయారు. ఆ టైంలో బాగా తోపులాట కూడా జరిగింది.
ఇదిలా ఉంటే ఆగస్టు ఆరవ తారీకు బీహార్ రాష్ట్రం పాట్నాలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ రోడ్డు పక్కనే ఉండే చాయ్ వాలా వ్యాపారులతో కాసేపు గడపడం జరిగింది. అంతేకాదు వాళ్లు ఇచ్చిన టీ కూడా విజయ్ దేవరకొండ తాగి వాళ్ళని సంతోషపరిచాడు. పాన్ ఇండియా సినిమా కావటంతో దేశంలో ప్రధాన నగరాలలో “లైగర్” టీం పర్యటిస్తోంది. ఈ క్రమంలో అభిమానుల మధ్యలో సందడి చేస్తూ వారితో ఎంజాయ్ చేస్తూ “లైగర్” పై ఆసక్తి రేపు తున్నారు. కాగా త్వరలోనే హైదరాబాదులో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున స్టార్ట్ చేయనున్నారట. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ రోడ్డు పక్కన తాగుతున్న టీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.