విజయ్ దేవరకొండ హీరోగా `నిన్నుకోరి`, `మజిలీ` వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 18న దిల్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 2020 ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!