నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ మరియు పాకిస్తాన్ టీం ల మధ్య T20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. దీంతో తొలుత బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్ 148 పరుగులను టార్గెట్ గా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రెండోసారి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 19.4 ఓవర్ లలో టార్గెట్ రీచ్ అయి గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ కి రౌడీ విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి మ్యాచ్ చూస్తూ కెమెరాలకు చిక్కటం జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ లతో కూడా సందడి చేశారు. ప్రతి ఈవెంట్ కి వెరైటీ దుస్తులతో వచ్చే విజయ్ దేవరకొండ ఈ మ్యాచ్ చూడటం కోసం కుర్తా…పైజామా దుస్తులు ధరించి రావడం జరిగింది. మ్యాచ్ చివరి వరకు ఉండి ఇండియా గెలుపుని విజయ్ దేవరకొండ ఆస్వాదించడం జరిగింది. విజయ్ కొత్త సినిమా “లైగర్” ఇటీవల రిలీజ్ అయ్యి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే.
కానీ నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకి ఆదరణ ఉన్న కొద్ది పెరుగుతూ ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మ్యాచ్ కి విజయ్ దేవరకొండ రావటంతో… మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో “హిందీ” లైగర్ పాటలు.. డైలాగులు.. ఆడియో రూపంలో వినిపించడం జరిగింది. ఉత్కంఠ భరితంగా రెండు దేశాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఎంతో ఒత్తిడి మధ్యలో హార్డీక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తో ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!