రౌడీ విజయ్ దేవరకొండ కొత్త సినిమా “లైగర్”. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావటంతో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు ఫస్ట్ నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశారు. ఇప్పటికే గుజరాత్, పాట్నా, ముంబాయి, ఢిల్లీ, చతిస్గడ్ వంటి చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే చాలా వరకు ప్రమోషన్ కార్యక్రమాలలో అంతకుముందు “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ సాధారణమైన చెప్పులు ధరించడం సంచలనం రేపింది. ఈ క్రమంలో హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రణవీర్ సింగ్ కొంత ఎగతాళిగా కూడా మాట్లాడారు. జనాలను ఆకర్షించడానికి ఇదొక పొలిటికల్ స్టంట్ అంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలకు చెప్పులు వేసుకురావటం పట్ల విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.
వాస్తవ జీవితంలో బ్రాండ్ తో సంబంధం లేకుండా అన్ని వస్తువులను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బయటికి వచ్చే సమయంలో కళ్ళకి ఏది నచ్చితే అది వేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అన్ని మ్యాచింగ్ చూసుకునే ఓపిక ఉండదని అందుకే ఎక్కువగా చెప్పులు అలవాటయ్యాయని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. సాధారణమైన చెప్పులు వేసుకుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారు అనే భావన తన ఉండదని పట్టించుకోను అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 13వ తారీకు నుండి సౌత్ ఇండియాలో ప్రధాన నగరాలలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకున్నాడు.