డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్”. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు “లైగర్” కోసం అనేక రీతులుగా కష్టపడ్డాడు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ ప్రయాణం ఈ సినిమాలో కనబడుతుంది. ఇప్పటికే “లైగర్” సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి.
ఇప్పటికే ముంబాయి, గుజరాత్, పాట్నా ఇంకా ఉత్తరాదిలో పలు రాష్ట్రాలలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడు అందుకున్నాయి. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు లోకల్ ట్రైన్ లలో పాటు ముంబై.. స్లామ్ ఏరియాలలో చేయడం జరిగింది. కానీ రీసెంట్ గా పంజాబ్ రాష్ట్రంలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పొలాలలో హీరో విజయ్ దేవరకొండ తో పాటు అనన్య పాండే సందడి చేసింది. పంజాబ్ తో పాటు హర్యానా రాష్ట్రాలలో పొలాలలో అక్కడి సంప్రదాయ దుస్తులలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఇద్దరూ ట్రాక్టర్ పై కూర్చుని సందడి చేశారు. కొన్ని ఫోటోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పంజాబ్ తనకి ఎంతగానో నచ్చిందని క్యాప్షన్ పెట్టారు. ఇలా ఉంటే వచ్చే ఈ వారం నుండి దక్షిణాదిలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ని పూరి “లైగర్” తో హిట్ ట్రాకెక్కిస్తాడన్న బలమైన నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!