తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న తమిళనాడు సీఎం పళనిస్వామిని విజయ్ కలిశారు. ఈ విషయం తమిళనాడులో సంచలనం రేపుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు.. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఆయన తండ్రి రాజకీయ పార్టీ పెట్టడం.. తాను నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండటం..! ఇన్ని నేపథ్యాల్లో విజయ్ సీఎంను కలవడం పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే.. సీఎంను కలిసింది తన మాస్టర్ సినిమా రిలీజ్ సందర్భంగానే అని అంటున్నారు. ఈ సందర్భంగా ఓ విన్నపాన్ని ఆయన ముందుంచాడని కూడా తెలుస్తోంది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన మాస్టర్ ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఆగిపోయింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఓటీటీకి రిలీజ్ ఇవ్వకుండా ధియేటర్ల పర్మిషన్ వరకూ వేచి చూశారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా 50 శాతం సీటింగ్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ అంశం పైనే సీఎంను విజయ్ కలిశాడని అంటున్నారు. సంక్రాంతికి మాస్టర్ రిలీజ్ అంటున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆ పరిమితిని పునఃపరిశీలించి 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు సినీ వర్గాలో హాట్ టాపిక్ అయింది. మాస్టర్ రిలీజ్ పై రేపు అఫిషియల్ న్యూస్ కూడా రాబోతోంది. దీనిపై సీఎం ఏ హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
విజయ్ విన్నపం చాలా కష్టమైన విషయమే. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల్లో భౌతిక దూరం ఉండాలనే నిబంధనతో ధియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ కోరిన విధంగా 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇస్తే చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. పైగా.. విజయ్ స్టార్ హీరో.. చాన్నాళ్ల తర్వాత ధియేటర్లలో పెద్ద సినిమా. కోరోనా సెకండ్ వేవ్ వార్తలు. ఈ సమయంలో ఫుల్ ఆక్యుపెన్సీ పర్మిషన్ ఇస్తే అభిమానులను ఆపడం కష్టం. మరి.. తమిళనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!