సెన్సెషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.. ‘లైగర్’ సినిమా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ విజయ్ దేవరకొండపై ప్రేమను చూపిస్తున్నారు.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ పెద్ద స్టార్ గా మారిపోయాడు..పెళ్లి చూపులుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గోతాగోవిందం మంచి హిట్ అందుకున్నాయి. ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. కానీ, తర్వాత ఆ స్థాయిలో హిట్ మళ్లీ రాలేదు.
తాజాగా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అయ్యింది. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, రమ్య కృష్ణ తల్లి పాత్రలో నటించింది. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించాడు.. అయితే ఈ సినిమాకు మిక్స్ టాక్ వినిపిస్తోంది.. కొందరు సినిమా బాగుంది అంటుంటే.. మరికొందరు డిజాస్టర్ అని చెబుతున్నారు.. అయితే ఈ సినిమాను విజయ్ తన భుజాలపై మోసాడనడంలో సందేహం లేదు..
ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 165 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.. లైగర్ సినిమాకు ముందు విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ.6 నుంచి రూ.7 కోట్లు పారితోషికంగా తీసుకునేవాడని అంటారు. కానీ లైగర్ సినిమాకు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేశాడని వార్త హల్ చల్ చేస్తోంది. లైగర్ కోసం విజయ్ ఏకంగా రూ.20 నుంచి రూ.25 కోట్లు తీసుకున్నాడట.. అందులో ఇప్పుడు కొంత వెనక్కి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.