సాధారణంగా మంచి, మానవత్వం మెండుగా ఉండే మన సెలబ్రిటీలు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. దానికి మించి.. కుదిరితే ఒకట్రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. దాని అభివృద్ధికి పాటు పడతారు. అయితే వీటన్నింటికీ తాను భిన్నం అని అంటున్నాడు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తను ఏకంగా రెండు తెల్ల పులులను దత్తత తీసుకున్నాడు. చెన్నై వండలూరులోని జంతు ప్రదర్శన శాలకు వెళ్లిన ఆయన అక్కడ జూ అధికారులు పెంచుతున్న తెల్లపులులను దత్తత తీసుకుని వాటి సంరక్షణార్ధం 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 2009లో ప్రభుత్వం జారీ చేసిన యానిమల్ యాక్ట్ దృష్ట్యా జంతువులను దత్తత తీసుకునేవారు.. జూలోని అధికారుల సహకారంతో వాటిని అక్కడే ఉంచి వాటి సంరక్షణను చూసుకోవాలి. “మనం అడవుల్లో చూడని చాలా జంతువులను ఇక్కడ చూడొచ్చు. మీరు మీ కుటుంబంతో ఇక్కడకు విచ్చేసినప్పుడు ఎంతో కొంత మొత్తాన్ని ఇవ్వండి. దీని ద్వారా అంతరించిపోతున్న జంతువులను సంరక్షణకు మన వంతుగా సాయపడిన వాళ్లమవుతాం“ అన్నారు విజయ్ సేతుపతి.
previous post
next post