Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన ఓవైపు స్టార్ హీరోగా దూసుకుపోతూనే.. మరోవైపు విలన్ పాత్రలను, సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `ఉప్పెన`తో ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఆయన.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్లో సందడి చేయబోతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `మెగా 154` ఒకటి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ చిరుకు తమ్ముడిగా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నాడట. చిరంజీవిని ఢీ కొట్టే విలన్ రోల్ లో ఆయన కనిపించబోతున్నారని.. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే విజయ్ సేతుపతి షూటింగ్లో సైతం జాయిన్ కానున్నట్లు టాక్ నడుస్తోంది.
మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!