పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందని భావించిన ప్రేక్షకులకు వారు అనుకున్న విధంగానే వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా “సలార్” తెరకెక్కుతున్న విషయం ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది.అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సీక్వెల్ గా కేజిఎఫ్_2 చిత్ర నిర్మాణం పూర్తవడంతో ప్రభాస్ సలార్ త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠానిని ఖరారు చేశారని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతేకాకుండా పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటిస్తున్నారనే సమాచారం వెలువడింది. అయితే ప్రస్తుతం విలన్ పాత్రలో జాన్ స్థానంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని విలన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ సినిమాలో హీరో విజయ్ తో పోటీ పడటం హైలెట్ గా నిలిచింది. అలాంటిది విజయ్ సేతుపతి మరోసారి ప్రభాస్ తో తలబడితే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. విజయ్ సేతుపతిని సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తే సౌత్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో నటించబోయే విలన్ పాత్ర గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత సలార్ చిత్రంలో నటించనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!