స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్నీ విలన్గా కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్సేతుపతి నటించబోతున్నాడట. బుధవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుందని సమాచారం. ఆర్య, ఆర్య 2 చిత్రాలు తర్వాత బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.