“లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. దాదాపు నెల రోజుల నుండి “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావటంతో… ఫస్ట్ నార్త్ ఇండియాలో అనేక చోట్ల హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఆగస్టు 13వ తారీకు నుండి సౌత్ ఇండియాలో “లైగర్” టీం ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది.
ఇప్పటికే వరంగల్, గుంటూరు, హైదరాబాద్, చెన్నై వంటి చోట్ల ప్రమోషన్స్ జరిగాయి. లేటెస్ట్ గా బెంగళూరులో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించగా… హీరో విజయ్ దేవరకొండ కి ఊహించని సంఘటన ఎదురయింది. బెంగళూరులో విజయ్ దేవరకొండ కి వీరాభిమాని తేజు అనే అమ్మాయి… అందరూ చూస్తుండగానే విజయ్ చేతికి రింగ్ తొడిగి మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఏడ్చేసింది. దీంతో ఆమెను విజయ హగ్ చేసుకుని.. ఈ రింగ్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు చేతికే ఉంచుతా… అని ఆమెకు మాట ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయ్ దేవరకొండ కి దేశవ్యాప్తంగా అమ్మాయిల ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఉత్తరాదిలో కూడా విజయ్ దేవరకొండ ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడికి వెళ్లినా భారీ ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పైనే ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు. పైగా ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా కీలక పాత్ర చేయడంతో “లైగర్” పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ గురువారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో… విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. “లైగర్” తో తమ అభిమాన హీరో మళ్ళీ ఫామ్ లోకి రావాలని.. హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు.