Mahesh-Rajamouli Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలోనే `సర్కారు వారి పాట`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ అనంతరం మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది పూర్తైన వెంటనే మహేశ్ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని మహేశ్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తుండగా.. ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రీసెంట్గా ఓ నేషనల్ మీడియా ఇంటర్య్వూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి-మహేశ్ సినిమాపై పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
అసలింతకీ ఆయన ఏం చెప్పారంటే.. `ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంక కథ పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న మహేశ్.. ఆపై త్రివిక్రమ్తో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది అంతా ఆ ప్రాజెక్ట్తోనే మహేశ్ ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా 2023 ఆరంభంలో స్టార్ట్ అవుతుంది` అంటూ చెప్పుకొచ్చారు.