టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ తో సినిమా తెరకెక్కుతుంటే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోతాయి. ప్రస్తుతం అటువంటి క్రేజ్ క్రియేట్ అవుతోన్న ప్రాజెక్ట్ రాజమౌళి – మహేశ్ కాంబినేషన్ మూవీ. ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా చాలా సమయం ఉన్న మాట వాస్తవం. అయితే తాము ఇద్దరం కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఒకరికొకరు ప్రకటించుకోవడంతో ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాలు.. వీరిద్దరూ కలిసి ఏ జోనర్ లో సినిమా చేస్తారు అనే అంశంపైనే ప్రధాన చర్చ నడుస్తోంది.
మహేశ్ ను అభిమానులు ఎప్పటినుంచో జేమ్స్ బాండ్ తరహా సినిమాలో చూడాలని కోరిక. దీంతో వీరిద్దరూ కలిసి ఇదే ప్రాజెక్ట్ చేస్తారని ఓ గాసిప్ రౌండ్ అవుతోంది. అయితే జానపద సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి ప్రస్తుతం పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కాబట్టి ఈసారి చారిత్రక కధాంశంతో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయింది. ఈ తరహా సినిమాలు తీయడంలో రాజమౌళి పనితనం ఎలాంటిదో తెలిసిన విషయమే. దీంతో మహేశ్ అభిమానులు కూడా తమ హీరోకు చారిత్రక కథాంశం అయితే బాగుంటుందని అంటున్నారు. మరి రాజమౌళి – మహేశ్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.