Virata Parvam: హీరోయిన్ సాయి పల్లవి అందరికీ సుపరిచితురాలే. నటన పరంగా అదేవిధంగా డాన్స్ పరంగా తిరుగులేని హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి వేసే డాన్స్ మరే హీరోయిన్ వేయలేదు అని చెప్పవచ్చు. ఇక ఇదే సమయంలో డ్రెస్సింగ్ విషయంలో చాలా హద్దులు కలిగిన హీరోయిన్. ఏమాత్రం ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లకు కక్కుర్తి పడకుండా… క్యారెక్టర్ డిమాండ్ కలిగిన పాత్రలు చేస్తూ రాణిస్తూ ఉంటది. అంతమాత్రమే కాదు ఇక్కడ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది కదా అని కూడా ఐటం సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా గానీ కాదని చెప్పే హీరోయిన్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అటువంటి హీరోయిన్ సాయి పల్లవి గురించి “విరాటపర్వం” డైరెక్టర్ వేణు సంచలన వ్యాఖ్యలు చేశారు. “విరాటపర్వం” లో రానాతో పాటు హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక సన్నివేశం చేయాల్సిన పరిస్థితి వచ్చిన తరుణంలో హీరోయిన్ సాయి పల్లవి… ఆ సన్నివేశం సినిమాకి ఎంతో కీలకమని అర్థం చేసుకుని… ఒక్క రోజు మొత్తం భోజనం చేయకుండా ఉంది అని వేణు చెప్పుకొచ్చారు. సాయి పల్లవి డెడికేషన్ ఆ లెవెల్ లో ఉంటుందని తెలిపారు.
సినిమాకి ఆ సీన్ చాలా హైలెట్ అని డైరెక్టర్ వేణు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సినిమాలో కీలక పాత్రలో ప్రియమణి కూడా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమా… 1990 లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. “విరాటపర్వం” విడుదల ఎప్పటినుండో అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటిటిలో రిలీజ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జులై 1వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.