Virata Parvam Release Date: రానా కథానాయకుడిగా చిత్రీకరించిన మువీ విరాటపర్వం ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ మువీని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు వేణు ఊడుగుల. ఈ మువీకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పిన ఆయన ధియేటర్ లలోనే ఈ మువీని విడుదల చేయాలన్న పట్టుదలతో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులను చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పారు వేణు.
విరాటపర్వంలో కథానాయకుడు రానా సరసర నాయకగా సాయి పల్లవి నటించారు. సురేష్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 1990 లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఆయన ఈ మువీ చేస్తున్నారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారని అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అరణ్య తరువాత రానా నుండి వస్తున్న ఈ మువీ ఎలాంటి రిజల్టు వస్తుందోనని అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.