Virata Parvam Trailer: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా విరాట పర్వం ట్రైలర్ను బయటకు వదిలారు. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న చిత్రమిది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రానా తన కలం పేరు అరణ్యతో పిలువబడే కామ్రేడ్ రవన్న పాత్రను పోషించగా.. సాయి పల్లవి వెన్నెల అనే పాత్రలో కామ్రేడ్ రవన్న కి ఆరాధకురాలిగా కనిపిస్తుంది. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ అద్భుతమైన ప్రేమకథలో రానా నక్సలైట్గా అదరగొట్టేశాడు. మరోవైపు సాయి పల్లవి నటన పరంగా విశ్వరూపం చూపించింది.
ఆధ్యంతం థ్రిల్లింగ్గా సాగిన ట్రైలర్ లో ప్రతి సన్నివేశం చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. రానా- సాయి పల్లవిల లవ్ ట్రాక్ హైలెట్గా నిలిచింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు సైతం బాగానే అలరించాయి. `ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది`, `నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉంటా` అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేస్తాయి. మరి ఆ అంచనాలను రానా-సాయి పల్లవిలు అందుకుంటారో..లేదో..చూడాలి.