Vishwak Sen: ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `వెళ్ళిపోమాకే`తో సినీరంగ ప్రవేశం చేసి `ఈ నగరానికి ఏమైంది`, `ఫలక్నుమాదాస్`, చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న విశ్వక్ సేన్.. `హిట్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత ఆయన చేసిన `పాగల్` పర్వాలేదనిపించింది.
ఇక ఇటీవల విడుదలైన `అశోకవనంలో అర్జున కళ్యాణం`తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడంతో పాటు కావాల్సినంత క్రేజ్ను దక్కించుకున్న విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నాడు. అంతేకాదు, తాజాగా ఈయన తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేశాడని ఓ టాక్ బయటకు వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. `అశోకవనంలో అర్జున కళ్యాణం` సినిమాకు ముందు వరకు రూ. 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. కొత్త ప్రాజెక్ట్స్ కోసం విశ్వక్ దగ్గరికి వెళ్లిన నిర్మాతలకు.. రూ. 3 కోట్లు ఇస్తేనే ప్రాజెక్ట్పై సైన్ చేస్తానని ఆయన చెబుతున్నాడట. మరి ఇంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కాగా, విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈయన చేసిన `ఓరి దేవుడా`, గంగాధర్ డైరెక్షన్లో నటించిన `ముఖచిత్రం` సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. వీటితో పాటు స్టూడెంట్ జిందాబాద్, అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే ప్రాజెక్ట్స్ కు సైతం విశ్వక్ సైన్ చేశాడు.