`టాటా బిర్లా మధ్యలో లైలా`, `మేం వయసుకు వచ్చాం`, `సినిమా చూపిస్తా మావ` లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ `హుషారు`తో మరో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతోంది. రీసెంట్ గా `ఫలక్ నుమాదాస్`తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి `పాగల్` అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్.. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.
ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ “`ఫలక్ నమా దాస్` లాంటి సూపర్ హిట్తో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా గత చిత్రం `హుషారు` సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి,కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. ఈ మూవీతో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం. ఈ `పాగల్` మూవీ బెస్ట్ క్రేజీ లవ్స్టొరీ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.