మరోవైపు… ఓం శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1లో రూపొందిన చిత్రం 4 లెటర్స్ . ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది సబ్ టైటిల్. ఈ సినిమా ద్వారా ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులోనూ బూతు సీన్స్కే పెద్దపీట వేశారు. ఈ సినిమాని కేవలం అడల్ట్ కంటెంట్ను నమ్ముకొనే తెరకెక్కించారు.
ట్రైలర్తోనే ప్రేక్షకులకు షాకిచ్చింది ‘ఏడు చేపల కథ’ మూవీ. కోరికలను కంట్రోల్ చేసుకోలేని ఓ కుర్రాడు ఏం చేశాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్కి యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇందులో కూడా అడల్ట్ కంటెంటే…
ఇక వీటన్నింటికీ పరాకాష్ట ‘లేడీస్ నాట్ అలోవుడ్’ అనే టీజర్.. ఇందులో బూతు శాతం మరీ పెరిగింది. అడల్ట్ కంటెంట్తోనే నింపేస్తూ, దానికి హార్రర్ జోడించారు. ఇంకేముంది దయ్యం పాత్ర చాలా ఛండాలమైన రీతిలో మగవారిని, ఆడవారిని ఆడుకుంటుంది.
ఈ సినిమాలు 18 సంవత్సరాలు పైబడ్డవారికే అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. యూ ట్యూబ్లో అప్లోడ్ చేసేశారు. దీనికి సెన్సార్ కత్తెర ఉండదు… ఇంకేముంది యువత విచ్చలవిడిగా ఈ ట్రయిలర్స్, టీజర్స్ చూసేస్తున్నారు. ఆయా సినిమాలపై విమర్శలు వచ్చేసరికే… చూడాల్సిన వారు చూసేస్తున్నారు. ఈ ట్రెండ్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్లో… ‘న భూతే భవిష్యత్’గా మారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.