Waltair Veerayya Veerasimhareddy: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “వాల్తేరు వీరయ్య”, “వీరసింహారెడ్డి” సినిమాలు రిలీజ్ కావటం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ ప్రధాన హీరోలుగా నటించిన ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించడం విశేషం. రెండు కూడా పెద్ద సినిమాలు అయినా గాని ఒక్క రోజు గ్యాప్ లో విడుదల చేయటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. గతంలో ఒకే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ఏ సినిమాలు కూడా ఒక రోజు గ్యాప్ లో విడుదల కాలేదు. కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన గాని అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.
ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ “వీరసింహారెడ్డి” అన్నా చెల్లెల సెంటిమెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్..గా “వాల్తేరు వీరయ్య” కూడా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో…పాటు ఈ రెండు సినిమాలకు దరిదాపులో మరో పెద్ద సినిమా లేకపోవడంతో.. నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల ఓటీటీ విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8 వారాల గ్యాప్ తర్వాత అనగా రెండు నెలల తర్వాత ఓటీటీ లలో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలో బాలకృష్ణ “వీరసింహారెడ్డి” నీ డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో, చిరంజీవి “వాల్తేరు వీరయ్య” నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల ఓటిటి హక్కులను హాట్ స్టార్ ప్లేస్…నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ గత సినిమా “అఖండ” డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. చిరంజీవి “గాడ్ ఫాదర్” నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ అవే ఓటిటి సంస్థలు తాజా చిత్రాల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.