మానుషి చిల్లార్ గత మూడు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు. 2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న భారత దేశం గర్వపడేలా చేసింది. ఒక్కసారిగా తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. అయితే ప్రస్తుతం మానుషీ వెండితెర పై అక్షయ్ కుమార్ తో కలిసి పృథ్వి రాజ్ అనే చారిత్రాత్మక నాటకం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయనుంది. కరోనా కారణం వల్ల చిత్ర నిర్మాణం ఆగిపోయినప్పటికీ, తిరిగి ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
హర్యానాకు చెందిన ఈ అందాలభామ మానుషి తను ఎప్పుడూ కూడా మోడల్ అవ్వాలని అనుకోలేదు. తన తల్లిదండ్రులు వృత్తిపరంగా డాక్టర్లు కావడంతో మానుషి చీల్లార్ కూడా అదే వృత్తిలో కార్డియాక్ సర్జన్ కావాలని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2017 మిస్ వరల్డ్ కావడంతో ఒక్కసారిగా తన జీవితమే మారిపోయిందని ఈ సందర్భంగా తెలియజేసారు.
అందాల పోటీల్లో పాల్గొన ముందు ఒక్కసారి కూడా ముంబైకి రాలేదని, మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు అక్కడ తనకు ఏమీ తెలియదని, తెలిసిన వారు కూడా ఎవరూ లేరు, కానీ ఈ మూడేళ్లలో ముంబై లో సొంత ఇంటినీ నిర్మించుకొని ముంబై మై హోమ్ టౌన్ అని చెప్పుకుంటున్నారు. గత మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు తిరిగాయని ఈ ఇంటర్వ్యూ ద్వారా చిల్లార్ తెలియజేశారు.
అమ్మా,నాన్నలు వృత్తిపరంగా డాక్టర్లు కావడంతో, తాను కూడా అదే రంగంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని భావించింది. కానీ ఊహించని కొన్ని కారణం వల్ల సంబంధం లేని.. పరిచయంలేని నటన రంగం లోకి వచ్చి తన నటన ద్వారా మనల్ని అలరించనుంది. తాను నటించబోయే పృథ్విరాజ్ సినిమా చాహమాన రాజవంశానికి చెందిన రాజ్ పుత్ రాజ్ పృథ్వి రాజ్ చౌహన్,కన్నౌజ్ యువరాణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.