యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 20 వ సినిమాకి సంబంధించి ఎపుడు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఏ ముహూర్తాన ఈ సినిమాని మొదలు పెట్టారో గాని ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కరెక్ట్ గా తెలిసిన న్యూస్ ఒక్క హీరోయిన్ పూజా హెగ్డే గురించే. అంతే తప్ప ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ …టైటిల్ ఏంటీ…ఎంత వరకు చిత్రీకరణ జరిగింది..ఇవన్ని ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన సమాచారం యూనిట్ నుంచి అందటం లేదు.
దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కావాలనే తన సినిమా అప్డేట్స్ ని బయటకు తేవాలంటే ముందు ప్రభాస్ ని మ్యాటర్ లోకి లాగాలి. అయితేనే ప్రభాస్ బయట పడి ప్రెజర్ తట్టుకోలేక తన తాజా సినిమా అప్డేట్ గాని టైటిల్ గాని టీజర్ గాని ..ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తునారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ఫైనల్ అయిందంటూ వార్తలు క్రియోట్ చేశారు. వాస్తవంగా ఈ సినిమాకి ముందు నుంచి అనుకున్న టైటిల్ జాన్.
అయితే దిల్ రాజు తమిళ రీమేక్ 96 కి తెలుగులో జాను అన్న టైటిల్ పెట్టడంతో ప్రభాస్ టీం ఈ టైటిల్ ని వదిలేశారు. ఆ తర్వాత రాధే శ్యాం అన్న టైటిల్ ని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇదే టైటిల్ తో ప్రభాస్ ఫస్ట్ లుక్ రానుందన్న న్యూస్ కూడా వస్తోంది. ఇంతలోనే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిస్ ప్రభాకరన్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రభాస్ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా టైటిల్ ని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రభాస్ భాగ్యశ్రీ మీద అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.