Movie tickets: ఈ మధ్యకాలంలో కరోనా గడ్డుకాలం తరువాత పెద్ద సినిమాల విషయంలో టికెట్ రేట్ల పెంపు అంశం ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పెరిగిన RRR టికెట్ రేట్లను చూసి అందరూ షాక్ అయ్యారు కూడా. ఈ క్రమంలో ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు కూడా టికెట్ రేట్లను పెంచడం మనకు తెలిసినదే. అయితే ఇలా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచడం పట్ల సాధారణ సినిమా ప్రేక్షకుడు కాస్త అసహనానికి గురి అయినప్పటికీ, అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క టికెట్ రేట్ల వల్లే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయనే వాదన కూడా లేకపోలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాజశేఖర్ కొత్త సినిమా విశేషాలు:
మళయాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్గా రాజశేఖర్ ‘శేఖర్’ అనే చిత్రం రాబోతోంది. దీనికి ‘జీవిత’ రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు ‘శివానీ’ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే విషయం మనకు తెలిసినదే. అయితే ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు ముమ్మురం చేసారు. ఈ సందర్భంగా నిన్న అనగా మే 17న ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల విషయమై జీవిత రాజశేఖర్ స్పందించింది.
టిక్కెట్ల రేట్లు మేము పెంచము:
ఈ ఈవెంట్లో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. “కరోనా తరువాత థియేటర్కు జనాలు రావడం తగ్గిపోయింది. సినిమా తీయడం కంటే విడుదల చేయడం ఇప్పుడు కష్టంగా మారింది. అయితే మంచి సినిమాలను మీరెప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. తప్పకుండా మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదు. కానీ పెద్ద సినిమాలకు అది తప్పదు. మా సినిమాకు మాత్రం థియేటర్ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం చెప్పిన రేట్లకే అమ్ముతున్నాం. మీకు అందుబాటులోనే ఈ టికెట్ రేట్లుంటాయి. కాబట్టి మా సినిమాకు రండి. మే 20న థియేటర్లో ఈ సినిమాను చూడండి” అని చెప్పుకొచ్చింది.