జాతిపిత మహత్మాగాంధీపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన జీవితంపై అనేక సినిమాలు వచ్చాయి. గాంధీ జీవిత కథ ఆధారంగా అనేక బయోపిక్ సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ గాంధీపై తెరకెక్కబోతోంది. హిందీలో గాంధీ జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. గాంధీ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.
ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఇప్పటివరకు గాంధీ పూర్తి జీవితానికి సంబంధించిన అంశాలపై సినిమా రాలేదు. ఈ వెబ్ సిరీస్ ద్వారా గాంధీ జీవితంలోని ప్రతి అంశాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు.
గాంధీ జీవితంపై వచ్చిన పలు పుస్తకాలను, ఆధారాలను బేస్ చేసుకుని ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను తెరపైకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ హన్సల్ చెబుతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రముఖ రచయిత రామచంద్ర గుహ రాసిన గాంధీ బిఫోర్ ఇండియా-గాంధీ ది ఇయర్స్ దట్ ఛేంజ్ ది వరల్ల్ అనే రచనలను మెయిన్ గా తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతీక్ నటించిన స్కామ్ 1922 సిరీస్ కు హన్సల్ మెహత్ దర్శకత్వం వహించారు. ఆ సిరీస్ పెద్ద సక్సెస్ అయింది. ఇతర దేశాల్లో కూడా ఆ వెబ్ సిరీస్ పాపులర్ అయింది. గతంలో హన్సల్ మెహతా-ప్రతీక్ గాంధీ హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సంచలన బయోపిక్ తెరకెక్కుతుండటంతో.. గాంధీ బయోపిక్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ బయోపిక్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.. ఎన్ని వివాదాలు వస్తాయో వేచి చూడాలి