Namrata-Saiee Manjrekar: ఇటీవల విడుదలైన `గని` చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్.. తన రెండో చిత్రాన్ని వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ తో చేసింది. అదే `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే రీసెంట్గా ఈ మూవీ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసింది. అలాగే మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్తో తనకున్న రిలేషన్ గురించి కూడా తెలియజేసింది. అయితే నమ్రతతో సయీ మంజ్రేకర్కు ఎలాంటి బంధుత్వం లేదు. కానీ, మేజర్ సినిమాలో ఆమెకు అవకాశం రావడానికి నమ్రతనే ప్రధాన కారణమట.
తాజాగా ఇంటర్వ్యూలో మేజర్ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు ఆమె `నమ్రత గారు మా పేరెంట్స్ కి తెలుసు. ఆవిడే కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి వివరించారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని నాతో చెప్పారు. తర్వాత శేష్ గారిని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం.` అంటూ చెప్పుకొచ్చింది.