Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నదే నిజమైంది..’భీమ్లా నాయక్’ వచ్చేది ఎప్పుడో ఫిక్సైంది. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం లేటెస్ట్గా వచ్చిన అప్డేట్తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారట. మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ మూవీలో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటించిన సంగతి తెలిసిందే. అదే మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – మాటలు, అలాగే పవన్ కోసం ఓ పాటను అందించారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 25న గానీ, ఏప్రిల్ 1న గానీ, థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు ప్రకటించారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ సినిమా రిలీజ్ డేట్ దాదాపు లాక్ చేసేశారట. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కామెడీ కింగ్ బ్రహ్మానందం కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నట్టు ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ చూస్తేనే అర్థమైంది. ఇటు అభిమానుల్లో, అటు ప్రేక్షకులు ఇండస్ట్రీ వర్గాలలో ‘భీమ్లా నాయక్’ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా చెప్పుకుంటున్నారు. ఆ అంచనాలను అందుకునేలాగానే ‘భీమ్లా నాయక్’ సినిమా ఉంటుందని మేకర్స్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు.
Pawan kalyan: ఇప్పుడు అదే నిజం కానుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో టికెట్ ధరలను పెంచుకునే అనుమతులను సీఎం జగన్ ఇవ్వబోతున్నారని ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఇది పాజిటివ్గా వచ్చే న్యూస్ అని కూడా చెబుతున్నారు. దాంతో ఇక ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ను ఆపకూడదని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ సీఎం జగన్ పెట్టిన కొత్త రూల్స్ అంత ఆశాజనికంగా లేకపోయినా కూడా ఫిబ్రవరి 25నే ‘భీమ్లా నాయక్’ సినిమాను అదే భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఇప్పటికే డిసైడయ్యారట. ఇది ముందు నుంచి పవన్ అభిమానులు చాలా గట్టిగా చెబుతున్న మాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 25నే మా ‘భీమ్లా నాయక్’ వచ్చేస్తాడని ప్రచారం చేశారు. ఇప్పుడు అదే నిజం కానుందని అంటున్నారు.