Jr Ntr : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ సినిమాలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడానికి జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు ప్రయత్నించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఎన్టీఆర్ కన్నా వయసులో ఎంతో పెద్దవాడైన రైజింగ్ రాజు తన కాళ్ళ మీద పడటానికి వస్తే అతనిని వారించి మీరు వయసులో నా కన్నా ఎంతో పెద్దవారు ఈ విధంగా చేయకూడదు అంటూ చెప్పి ఆయనను ఒక శాలువాతో సత్కరించి షీల్డ్, ఒక మొక్కను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా రైజింగ్ రాజు ఎన్టీఆర్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదు. తాజాగా రైజింగ్ రాజు ఆ విధంగా ఎన్టీఆర్ కాళ్లపై పడటానికి గల కారణం వివరించాడు. రైజింగ్ రాజు పరుచూరి బ్రదర్స్ దగ్గర ఉన్నప్పుడు ఓ సారి సీనియర్ ఎన్టీ రామారావు గారిని కలిసే అవకాశం వస్తే ఆయనను కలిసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారట. అదే విధంగా మరోసారి తన స్నేహితులతో కలిసి ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ గారిని కలిసే అవకాశం వచ్చింది.హరి కృష్ణ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్టీఆర్ ఇచ్చిన వస్తువులు ఎప్పటికీ మర్చిపోలేను..
ప్రస్తుతం రైజింగ్ రాజు ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ ని కలిసే అవకాశం రావడంతో ఎన్టీఆర్ ని చూడగానే ఒక్కసారిగా నటరత్నం ఎన్టీ రామారావు, హరికృష్ణ గారు గుర్తుకు వచ్చారని అందువల్లే ఎన్టీఆర్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవాలనిపించిందని ఈ సందర్భంగా రైజింగ్ రాజు తెలిపారు. అయితే సంస్కార విషయంలో అప్పటి ఎన్టీ రామారావు నుంచి నేడు జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం తీసిపోరని ఈ సందర్భంగా రైజింగ్ రాజు కొంతవరకు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ తనకు బహూకరించిన శాలువా, షీల్డ్, మొక్కను వారి గుర్తుగా ఎప్పటికీ తన దగ్గర ఎంతో భద్రంగా దాచుకుంటానని ఈ సందర్భంగా రైజింగ్ రాజు ఎన్టీఆర్ కుటుంబం పై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేశారు.