యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో “రాదే శ్యాం” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాతకాలంనాటి పిరియాడికల్ లవ్ స్టోరీ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పూజ క్యారెక్టర్ సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినబడుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే డబల్ రోల్ లో నటిస్తున్నట్లు ఆ వార్త సారాంశం.
దీంతో ఈ వార్త వినే సోషల్ మీడియాలో నెటిజన్లు సాధారణంగా డబుల్ క్యారెక్టర్ రోల్స్ హీరోలకు వస్తాయి కానీ హీరోయిన్ కి రావడం ఇదే ప్రథమం పైగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కి అంటూ యాటకరంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కవలలు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రభాస్ నీ ప్రేమిస్తారని చివరికి ఒకరు త్యాగం చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇదంతా పుకార్లు అని అసలు ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.
కావాలని ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ ఆడుతున్న డ్రామాలు అని మరి కొంతమంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మళ్లీ పునఃప్రారంభించడానికి సినిమా యూనిట్ మొత్తం ఇటలీ బయలుదేరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.