థెరి(తెలుగులో పోలీసోడు), మెర్సల్(అదిరింది) సినిమాలు బ్లాక్బస్టర్ హిట్ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదిస్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సాగే సినిమా. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ అంచనాలు నడుమ ఈ ఏడాది దీపావళికి సినిమా విడుదల కానుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా అన్నీ భాషల శాటిలైట్ హక్కులను సన్ టీవీ ఏకంగా 60 కోట్ల రూపాయలను చెల్లించి దక్కించుకోవడం విశేషం. విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన `అదిరింది` సినిమా 200 కోట్ల రూపాయల బిజినెస్ను రాబట్టింది. ఈ లెక్కలో చూస్తుంటే ఈ హ్యాట్రిక్ సినిమా దాన్ని మించేలానే ఉంది.
previous post
next post