Nagarjuna- NTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నేడు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ను చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని మురళీ కృష్ణ, అలీ, ఆర్. నారాయణమూర్తిలు కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించారు.
దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్లో సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి, థియేటర్స్ నిబంధనలు, నంది అవార్డ్స్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు నడిచాయి. మీటింగ్ అనంతరం చర్చలు సఫలమైట్లు సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇకపోతే ఈ భేటీలో కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు సైతం పాల్గొనవాల్సి ఉంది.
కానీ, వీరిద్దరూ నేడు హాజర్ కాలేదు. దీంతో జగన్తో భేటీకి నాగార్జున, ఎన్టీఆర్ డుమ్మా కొట్టడం వెనక కారణం ఏంటా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిందట.
దీంతో నాగార్జున హోం ఐసోలేషన్లో ఉన్నారని.. అందుకే ఆయన భేటికి దూరంగా ఉన్నారని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ పలు వ్యక్తిగత కారణాలు వల్ల నేడు జగన్తో జరిగిన మీటింగ్కు రాలేకపోయారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!