సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా అయిదు భాషల్లో భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అల్లు అర్జున్ కి జంటగా నటిస్తుంది. లాక్ డౌన్ తో చక్కగా ఇంట్లోనే ఉంటూ చిత్తూరు యాసని ప్రాక్టీస్ చేస్తుందట. పుష్ప లో చిత్తూరు యాస లో మాట్లాడటానికి, సొంతగా డబ్బింగ్ చెప్పేందుకే ఈ ప్రయత్నాలు చేస్తుంది రష్మిక.
ఇక జూలై చివరి వారం లేదా ఆగస్టు నుండి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళడానికి సుకుమార్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యం అవడం తో ఇక నుంచైనా శరవేగంగా చిత్రీకరణ జరిపేందుకు షెడ్యూల్స్ వేస్తున్నారట. అంతేకాదు కేరళ లో ఉన్న దట్టమైన అడవుల్లో చేయాల్సిన షూటింగ్ మొత్త ఇప్పుడు హైదరాబాద్ లో అడవి సెట్ వేసి చిత్రీకరణ జపాలని సన్నాహాలు చేస్తున్నారట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియో తో పాటు భూత్ బంగళా ప్రాంతంలో సెట్స్ వేస్తున్నారట.
అయితే సుకుమార్ ఇంతగా కష్టపడి సెట్స్ నిర్మించి షూటింగ్ కి ప్లాన్ చేస్తుంటే హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఇప్పట్లో షూటింగ్ లో జాయిన్ కాలేనని పేచిపెడుతుందట. హీరో అయిన అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడా అని సుకుమార్ కాల్ కోసం వేయిట్ చేస్తుంటే ఈ కన్నడ బ్యూటి మాత్రం మరో మూడు నెలల వరకు రాలేనని చెప్పిందట. కరోనా కి భయపడే ఇలా చెప్పిందని సమాచారం. ఇక ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైందన్న టాక్ ఉంటే ఇప్పుడు అడవి సెట్ తో మరింతగా బడ్జెట్ పెరగనుందని తెలుస్తుంది.