దిల్ రాజు బ్యానర్ లో సమంత నటించిన లాస్ట్ మూవీ జాను. భర్త నాగ చైతన్య ఎంత చెప్పిన వినకుండా ఓ బేబి అంత ఊహించుకొని జాను చేసింది. తమిళంలో త్రిష కి మంచి కం బ్యాక్ మూవీ అయిన 96 ని దిల్ రాజు ఎంతో మోజు పడి సమంత తో నిర్మించాడు. కాని ఈ సినిమా ఇద్దరికి గట్టి షాకిచ్చింది. అంతే ఆ తర్వాత సమంత తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ లోపు కరోనా వచ్చి పడింది.
అయితే సమంత తమిళంలో మాత్రం ఒక సినిమా కమిటయిందన్న వార్తలు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్నాయి. అదే సమంత నటించబోతున్న లేటెస్ట్ సినిమా అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇటీవల కోలీవుడ్ లో అఫీషియల్ అని సమాచారం. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నయనతార కూడా నటిస్తుంది.
అయితే ఈ సినిమా కోసం సమంత తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట. అందుకు కారణం ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో నిర్మించడం ఒకటైతే కరోనా పరిస్థితుల కారణంగా నిర్మాతకి అండగా ఉండాలన్న ఉద్దేశ్యం మరొకటి అని తెలుస్తుంది. మరి మరో హీరోయిన్ నయనతార తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందా లేదా అన్నది తెలియరాలేదు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.
అయితే సమంత మన తెలుగు సినిమాలకి కూడా ఇలా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటుందా అన్న ఆశ మన మేకర్స్ కి కలిగిందట. అందుకే ఇప్పుడు కొంతమంది దర్శ, నిర్మాతలు సమంత కి కథ చెప్పి నచ్చి…చేస్తానని రెమ్యూనరేషన్ గనక తగ్గించుకుంటా..అంటే తన డేట్స్ లాక్ చేసి పెట్టుకుందామన్న ఆలోచన చేస్తున్నారట. ఇక సమంత ఫామిలీ మాన్ సీజన్ 2 లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండగా ఇందులో నెగిటివ్ రోల్ చేసిందని ప్రచారం జరుగుతోంది.