నిఖిల్కి హీరోగా బ్రేక్ తెచ్చిన సినిమాల్లో `కార్తికేయ`. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఆ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా `కార్తికేయ 2` రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. `సవ్యసాచి` ప్లాప్ తర్వాత చందు మొండేటికి హిట్ అవసరం… మరో పక్క హీరో నిఖిల్కి కూడా హిట్ అవసరం ఈ తరుణంలో వీరిద్దరి కాంబినేషన్లో `కార్తికేయ 2` సినిమాతో చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `కార్తికేయ`లో నిఖిల్ జతగా స్వాతి హీరోయిన్గా నటించింది. ఇప్పుడు సీక్వెల్లో హీరోయిన్గా శృతి శర్మ నటించనుందని సినీ వర్గాల సమాచారం. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` చిత్రంలో శృతి శర్మ హీరోయిన్గా నటించింది. అక్టోబర్ రెండో వారం నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!