Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాల షెడ్యూళ్లతో షూటింగ్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ 3డి, యాక్షన్ డ్రామాగా సలార్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలాగే, ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే ఆదిపురుష్ 3డి చిత్రీకరణ పూర్తి అయింది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతోంది.
కాగా, కేజీఎఫ్ దర్శకుడి నుంచి వస్తున్న సలార్ సినిమాపై అటు ప్రభాస్ అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాగా సలార్ మూవీపై సంచలనాలు మరో లెవల్లో ఉంటాయనడంలో సందేహమే లేదు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబో తున్నాడు. నటుడిగా, దర్శకుడిగా ఈయనకి సౌత్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు సలార్ కోసం ప్రశాంత్ నీల్ దింపడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
Prabhas: సలార్ కోసం ప్రశాంత్ నీల్ దింపడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
ఇక ఇటీవలే వచ్చిన రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ భారీ హిట్ అందుకుంటాడనుకుంటే సాహో కంటే ఇంకా దారుణం అనే టాక్ వచ్చింది. రాధే శ్యామ్ ఫ్లాప్ అని ప్రభాస్ అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడంటేనే ఈ సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, సలార్ సినిమాతో గత నాలుగేళ్ళుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నవన్నీ ఇవ్వడానికి పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ, ఇకా దీనిపై క్లారిటీ లేదు. మరి సలార్ సినిమాతోనైనా ప్రభాస్ అందరూ ఆశించే హిట్ ఇస్తాడా లేదా చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?