Prabhas: మన టాలీవుడ్లో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్గా క్రేజ్ తెచ్చుకున్నా రు ప్రభాస్. బాహుబలి సినిమాల తర్వాత ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అసాధారణం అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్లో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగుపోయింది. సినిమాకు ఇన్ని కోట్లు అని రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ఇప్పుడు రోజుకు ఇన్ని కోట్లు అని డిమాండ్ చేసే రేంజ్కు వచ్చారు. అయితే, బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ ఆశించిన సక్సెస్ను సాహో ఇవ్వలేక పోయింది. ఈ సినిమా ఒక బాలీవుడ్లో తప్ప మిగతా అన్నీ చోట్ల నష్టాలను మిగిల్చింది.
ఇక కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళు ఆలస్యంగా రిలిజ్ అవుతోంది ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ను డిసైడ్ చేస్తుందా..? అని చర్చలు మొదలయ్యా యి. సౌత్, నార్త్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ఓవరీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రభాస్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ సినిమాలు చైనా జపాన్ లలో కూడా విడుదలవుతూ సంచలనాన్ని సృష్ఠిస్తున్నాయి. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘రాధేశ్యామ్’ సినిమా బడ్జెట్ ముందు అనుకున్నదానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో దాదాపు రూ 300 కోట్ల భారీ బడ్జెట్తో ‘రాధేశ్యామ్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో ప్రభాస్ సోదరి కూడా నిర్మాణ రంగం లోకి దిగడం విశేషం.
Prabhas: బాలీవుడ్ హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో..!
అయితే, ముందు ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ రూ 250 కోట్ల లోపే. కానీ, కరోనా కారణంగా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవడం..కొంత రీ షూట్…వీఎఫెక్స్ వర్క్ను కలిపి అదనం గా మరో రూ.50 కోట్ల వరకు ఖర్చయింది. ఒక లవ్ స్టోరీ మీద ఇంత బడ్జెట్..అనే సందేహాలూ చాలామందిలో ఉన్నాయి. కానీ, కథ డిమాండ్ చేయడం..ప్రభాస్ మార్కెట్ ను దృష్ఠిలో పెట్టుకొనే అంత బడ్జెట్ పెట్టడానికి కారణం అని మేకర్స్ చెబుతున్నారు. హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. ఈనెల 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రభాస్ మార్కెట్ను డిసైడ్ చేస్తుందని అంటున్నారు. ఇప్పుడు న్న సౌత్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో ప్రభాస్. మరి ‘రాధేశ్యామ్’ తర్వాత ఆయన మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.