Rashmika mandanna: పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన స్టార్ హీరోయిన్స్లో ఒకరు రష్మిక మందన్న. సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న కియారా అద్వానీ, పూజా హెగ్డే లాంటి కమర్షియల్ హీరోయిన్స్తో రష్మిక మందన్న గట్టిగా పోటీ పడుతోంది. పుష్ప సినిమా పార్ట్ 1తో రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్గా మారింది. దాంతో తెలుగు కంటే ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లోనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే రెండు హిందీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఇక తెలుగులో పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం సిద్దమవుతుండగా బాలీవుడ్లో కొత్తగా యానిమల్ అనే సినిమాను కమిటయింది. ఈ సినిమాకు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ ఎంతగా పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇదే సినిమాను కబీర్ సింగ్గానూ హిందీలో షాహిద్ కపూర్, కియారాలతో తీసి భారీ హిట్ అందుకున్నా డు. దాంతో బాలీవుడ్లో సందీప్ రెడ్డి క్రేజీ ఆఫర్ అందుకుంటున్నాడు.
Rashmika mandanna: రొమాంటిక్ సీన్స్ చేసే సినిమా యానిమల్ మాత్రమే..
ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఈ సినిమాలో హీరో పాత్ర వైల్డ్ యానిమల్ తరహాలో ఉంటుందట. అలాంటి హీరో రష్మిక మంచి రొమాంటిక్ రోల్లో నటిస్తుందని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే మధ్య ఉన్నటువంటు బోల్డ్ సీన్స్ చాలా ఉంటాయట. ఈ సీన్స్లో నటించేందుకు రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదే నిజమైతే రష్మిక కెరీర్లో ఇంత ఘాటు రొమాంటిక్ సీన్స్ చేసే సినిమా యానిమల్ మాత్రమే అవుతుంది. బాలీవుడ్కు ఎలా కావాలో అల రెడీ అవుతోంది ఈ కన్నడ బ్యూటి.