Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.తన అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా తీయాలని రాజమౌళి, త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ప్రముఖ లేడీ డైరెక్టర్ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
గురు,తాజాగా ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర మహేష్ బాబుకి తన కథను వినిపించి ఎలాగైనా మహేష్ ని సినిమా చేయడానికి ఒప్పించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈమె తెరకెక్కించిన ఆకాశమే నీ హద్దురా సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందంటే ఏ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారో అర్థమవుతుంది. అయితే సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు ఒప్పుకుంటే మొట్టమొదటి లేడీ డైరెక్టర్ తో చేసిన స్టార్ హీరో మహేష్ బాబు అని చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు త్రివిక్రమ్ కథను సిద్ధంగా చేసుకొని ఉండగా, మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సుధా కొంగర తన స్క్రిప్టు ద్వారా మహేష్ బాబును ఒప్పించాలని ట్రై చేస్తోంది. అయితే సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తారా లేదా అనే విషయం గురించి అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.