Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా గత ఏడాది నుంచి ఎదురు చూస్తున్న సినిమా. బ్యాంకింగ్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విదేశాలలో స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాగా దర్శకుడు పరశురామ్ పెట్లా రూపొందిస్తున్నాడు. బాబును అభిమానులు ఎంత స్టైలిష్ లుక్లో చూడాలనుకుంటున్నారో ఆయన నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో అవన్నీ సర్కారు వారి పాటలో ఉండబోతున్నాయి.
ఇక ఈ మూవీ షూటింగ్ ఒక పాట మినహా మిగతా అంతా పూర్తైంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడిచింది. త్వరలో ఈ సాంగ్ కూడా కంప్లీట్ చేయనున్న చిత్రబృందం..ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతోంది. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మూవీ నుంచి 3వ పాట రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. కళావతి, పెన్నీ సాంగ్స్ కంటే ఇప్పుడు రాబోతున్న ఈ మూడవ సాంగ్ మరో లెవల్లో ఉంటుందని ఇప్పటికే థమన్ చెప్పుకొచ్చాడు కూడా. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.
Sarkaru Vaari Paata: ట్రైలర్ విషయంలో మేకర్స్ జాగ్రత్తపడుతున్నారు.
మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దాంతో ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. ఆచార్య సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. అయితే, సర్కారు వారి పాట థర్డ్ సింగిల్ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, పోకిరి వైబ్స్ అని చెబుతున్న మేకర్స్ అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ను కట్ చేస్తున్నారట. ముఖ్యంగా థమన్ ట్రైలర్కు ఇచ్చే బీజీఎంతో అంచనాలు అమాంతం పెంచేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే అచార్య ట్రైలర్ అభిమానులనే తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే, అలాంటి ఫీడ్బ్యాక్ సర్కారు వారి పాట ట్రైలర్ విషయంలో రాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు.