బయోపిక్ అంటే.. రియల్ లైఫ్ క్యారెక్టర్ కీ, అందులో నటిస్తున్న వారికీ కచ్చితంగా పోలికపెట్టి చూస్తారు ప్రేక్షకులు. క్రీడాకారుల రియల్ లైఫ్ క్యారెక్టర్ లు ఎవరికీ పెద్దగా తెలియవు కాబట్టే.. వారి బయోపిక్స్ లో డ్రామా బాగా ఎలివేట్ అయి, అవి విజయవంతం అయ్యాయి. సావిత్రి బయోపిక్ విషయంలో తనపై లేని అంచనాలను కీర్తిసురేష్ అందుకోవడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అచ్చం సావిత్ర లాగేనే కిర్తీ ఒదిగిపోయిన తీరు చూసి ప్రేక్షకులు మహానటికి బ్రహ్మరథం పట్టారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తు నిర్మించిన సినిమా ఎన్టీఆర్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి పార్ట్ కథానాయకుడు రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పోస్టర్స్లో అచ్చం ఎన్టీఆర్ లుక్లో ఉన్న బాలయ్య బిగ్ స్ర్కీన్ మీదకి వచ్చేసారి ఎన్టీఆర్ అభియాన్ని పలికించడంలో విఫలం అయ్యాడు. ఆ మహానటుడి పాత్రలో బాలయ్యను ప్రేక్షకులు అంగీకరించలేదు. ఈ సినిమా దర్శకత్వ లోపాలతో పాటు నటుడిగా ఎన్టీఆర్ తో బాలకృష్ణను పోల్చి చూడలేకపోయారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఎఫెక్ట్తో మొదటి భాగం ప్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఇక రెండో భాగాంగా వస్తున్న మహానాయకుడులో రాజకీయ కోణం ఆసక్తిగా ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.ఇది కూడా మొదటి భాగంలాగే ఉంటే మహానాయకుడి రిలీజ్ అయిన రెండు రోజులకే మర్చిపోతారు ప్రేక్షకులు.
రాజకీయ నాయకుల్లో ముఖ్యమంత్రి అయిన తక్కువ టైంలోనే ప్రజల గుండె లోత్తులో కొండంత అభిమానం ఏర్పర్చుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఇప్పుడు జీవించి లేకపోయిన వైఎస్ హావభావాలు, ప్రజలతో మాట్లాడే తీరు..ఆయన ఒరిజినాలిటి. టెక్నాలజీ పుణ్యమా అని రికార్డెడ్ వీడియోల ద్వారా ఇంకా వైఎస్ఆర్ ప్రజల్లో జీవించే ఉన్నారు. ఆయన జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం యాత్రం.ఈ బయోపిక్లో వైఎస్ఆర్ పాత్రలో మాళయాలం నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. 3సార్లు జాతీయ అవార్డు అందుకున వంకపెట్టలేని ఉత్తమనటుడు. అలాంటి మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాడు. యాత్ర ట్రైలర్లు, ప్రోమోలుల్లో వైఎస్ హావభావాలు, నడకతీరు అచ్చంగా దిసేశాడు మమ్ముట్టి. అంతేకాదు ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో యాత్రపై హై రేంజ్లో హైప్ క్రియేట్ అయింది.
వైఎస్ఆర్ క్యారెక్టర్ లో కావాల్సినంత డ్రామా పండించడానికి మమ్ముట్టికి స్కోప్ దొరికింది. ప్రజాయాత్రలో అడుగడుగునా పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగే వైఎస్ఆర్ పాత్ర అద్భుతంగా వచ్చిందని ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. పేదలతో మాట్లాడేటప్పుడు, వారి కష్టాలు చూసి చలించిపోయేటప్పుడు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కచ్చితంగా వైఎస్ఆర్ ని గుర్తు చేస్తున్నాయి. ఒక ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ని ఒక ఫుల్ టైమ్ నటుడు చేస్తున్నాడు కాబట్టి యాత్రకు మమ్ముట్టి కచ్చితంగా ప్లస్ అవుతాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తో పోల్చిచూస్తే మమ్ముట్టి తప్ప యాత్రలో చెప్పుకోతగ్గ నటీనటులు లేరు. స్టార్ కాస్ట్ తో పాటు, బడ్జెట్ లో కూడా కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది. నందమూరి అభిమానులే కాదు, టీడీపీ నాయకులంతా ఎన్టీఆర్ బయోపిక్ ని గొప్పగా ప్రమోట్ చేశారు కానీ యాత్ర విషయంలో ఎవరూ అలా ఓన్ చేసుకోలేదు. సినిమా టాక్ ఆధారంగానే బాక్సాఫీస్ జర్నీ ఉంటుంది. మమ్ముట్టి నటనే యాత్రకు ప్రధానాకర్షణ కానుంది. ఎన్టీఆర్ కి బాలయ్య మైనస్ అయితే యాత్రకి మమ్ముట్టి ప్లస్ అవుతున్నాడు.మరి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నీ యాత్ర బాక్సాఫీస్ వద్ద విజయ యాత్రగా నిలుస్తోందో లేదో చూడాలి.